నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Jun 25, 2010

పటుమతి నట మున్ను మహా I నటుఁ డీశుఁడు వాచకాభినయమునకై

క.
పటుమతి నట మున్ను మహా I నటుఁ డీశుఁడు వాచకాభినయమునకై యు

త్కటయతిలయమయతాళ I స్ఫుటవికటచ్ఛంద మందముగ నొనరించెన్. 6
మహా నటుడైన ఈశ్వరుడు పూర్వం వాచకాన్ని అభినయించే సందర్భంలో అధికమైన యతిలయ తాళములతో కూడిన స్ఫుటమైన వికటఛందాన్ని  అందముగా కూర్చినాడట.
క.







సృజియించి యిచ్చె నజునకు 
నజుఁడును భరతునకునిచ్చెనమ్మునివరుడున్
ఋజుమతి యగు పింగళుఁ డను
భుజగమునకు నిచ్చె భుజగభోజను డచటన్. 7

శివుడు ఛందశ్శాస్త్రాన్ని సృష్టిచేసి బ్రహ్మదేవునికి ఇచ్చాడట. బ్రహ్మ భరతు డనే మహామునికి, ఆ ముని పింగళుడనే నాగరాజుకు ఇచ్చాడట. అక్కడ ఉన్న గరుత్మంతుడు అప్పుడు,
క.
ప్రియ యిది యేటిది నావుడు
బుయిలోడిన పలుకు తుదల పొల్లుల చేతన్
మయరసతభజన గణము లు
దయమొందెన్, ఛంద మొందె దద్గణయుక్తిన్.8

ప్రియ యిది యేమిటి అని అడుగగా సంకోచముతో పలికిన పలుకుల చివరన గల పొల్లక్షరముల వలన మ, య, ర, స, త భ , జ , న గణములు పుట్టినవి. ఆ గణములతో ఛందస్సు ఏర్పడినది.
క.








గురువును లఘువును శంకర
గిరిజాకృతులు తత్ప్రకృతములు గణముల్
గరుడినిపై పింగళఫణి
విరచించిన తెఱఁగు వరుస వివరింతుఁ దగన్. 9
గురువు శంకరుడు, లఘువు పార్వతీ దేవి ఆకృతులనుండి ఉద్భవించాయి. వాటినుండి ఏర్పడిన గణములతో కూడిన ఛందాన్ని గరుడినిపై పింగళఫణి విరచించిన విధంగా వరుసగా తెలియపరుస్తాను, అంటున్నాడు.
వ.
అవి యెయ్యవి యనిన --- ధీశ్రీస్త్రిమ్, వరాహాయ్, కాగుహార్, వసుధాస్, సాతేక్వత్, కదాసజ్, కింవదభ్, సహసన్: ఇట్లని గరుడ భయంబుననుం దిర్యగుదితస్వభావంబునను సాభిప్రాయజ్ఞేయనేయార్థంబుగా గణస్వరూపనిరూపణంబు నకునై పింగళనాగంబుచేత నుచ్ఛరితంబు లగు తద్వాక్యాంతరంబులం బొల్లులై తోఁచు మకార - యకార - రేఫ - సకార - తకార - జకార - భకార - నకారంబులు గణాభిదానంబులకు నాద్యక్షరంబు లగుటచేత మగణ - యగణ - రగణ - సగణ - తగణ - జగణ - భగణ - నగణంబులు గ్రమంబునం బ్రస్తారోద్ధారంబునం బ్రభవించెఁ, దత్స్వరూపంబులునుం దదధిదైవతంబులం బరిపాటిం బ్రకటింతు నెట్లనిన 11
అవి
ధీశ్రీస్త్రీ   U U U    మ  గణము
వరాహా  I U U    య గణము
కాగుహా U I U    ర గణము
వసుధా  I I U    స గణము
సాతేక్వ U U I    త గణము
కదాస   I U I    జ గణము
కింవద  U I I    భ గణము
సహస  I I I     న గణము  లు. ఇవి గరుడని వలని భయంబు చేత గాని తిర్యగ్జాతుల స్వభావం నుండి సహజంగా పుట్టే ధ్వనులుగా పింగళ నాగము నుండి వెలువడిన ధ్వనులు గణాలుగా రూపాంతరం చెందినవి. ఆ వాక్యాంతము లందుండే హల్లక్షరాలే వాటికి నామాక్షరములు గా ఏర్పడినవి. వాటి వివరములను వాటి వాటి అధిదైవతములను క్రమంగా తెలియ పరుస్తాను, అంటాడు..

0 comments:

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks