Hosted by eSnips |
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్.
చివరికెలాగయితేనేం దశరథుడు రామలక్ష్మణులను విశ్వామిత్త్రునితో యాగరక్షణకై పంపిస్తాడు.
ఉ.
స్కందవిశాఖు లిద్దఱును స్థాణుని వెంబడి నేగినట్లు శ్రీ
స్యందిముఖాశ్వినేయులును సారసగర్భుని వెంట నేగి న
ట్లందపుఁబ్రోవులౌ దశరథాత్మజు లిద్దఱు గాధిసూతి వెం
టం దపనీయ పాద వికట స్ఫురణంబుల నేగఁజొచ్చినన్. 76
స్కందుడు విశాఖుడు ఈశ్వరుని వెనుక వెళ్లినట్లుగాను, శ్రీస్యందిముఖాశ్వినేయులు విష్ణుని వెనుక వెళ్ళినట్లుగా రామలక్ష్మణులిరువురూ విశ్వామిత్రమహర్షి వెనుక వెళ్ళారట. ఇక్కడ విశ్వనాథవారు వెనుకకుఁ దిరుగఁడు తఱుముచు అని మొదలయ్యే 4 వరుస కందపద్యాల్ని వ్రాసారు. అలా వారు ముగ్గురూ సాయంత్రం అయ్యేసరికి సరయూనది దక్షిణ తీరం చేరతారు. ఆ సాయం వేళలో సూర్యాస్తమయానికి ముందుగానే రామలక్ష్మణులకు బల అతిబల అనే రెండు విద్యలను నేర్పిస్తాడు. వీటి ప్రభావం వలన వారిని ఆకలి దప్పులు, జ్వరము మొదలగునవి బాధించవు. ఆ రాత్రికి వారు ముగ్గురూ అక్కడ నిద్ర చేస్తారు. వేకువనే విశ్వామిత్రుడు మేల్కని రామలక్ష్మణులను నిద్రలేపుతాడు.
తొలివెలుఁగయ్య నిదోయి ! యోయి ! యోకో
సల సుతప్రజ ! సాధు రామచంద్రా !
తొలివెలుఁగయ్య నిదోయి ! కౌసలేయా !
మెలకువ వచ్చెనె మీకు రామభద్రా !
లేచి దైవమైన యాహ్నికంబుఁ దీర్పుండనినఁ దల్లి పిలుపుకన్నఁ బ్రేమార్ద్రము మృదువు నైన మునిమాటకు మేల్కని ---
Hosted by eSnips |
0 comments:
Post a Comment