నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Jan 10, 2009

శ్రీమహాభాగవతము-దశమస్కంధము

మృద్భక్షణ-విశ్వరూప ప్రదర్శన

ఓసారి బలరాముడు అతని స్నేహితులు కలసి యశోదతో కృష్ణుడు మన్ను తిన్నాడని పితూరీ చేస్తారు. అప్పుడు యశోద కృష్ణుని పట్టుకుని నిలదీసి అడుగుతుంది 'మన్ను తిన్నావటా'ని. అప్పుడు కృష్ణుడు యశోదతో--

శా.
అమ్మా! మన్ను దినంగ నే శిశువునో యాఁ కొంటినో వెఱ్ఱినో
నమ్మంజూడకు వీరి మాటలు మది న్న న్నీవు కొట్టంగ వీ
రిమ్మాగ్గమ్ము ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీ యాస్య గం
ధ మ్మాఘ్రాణము సేసి నా వచనముల్ దప్పైన దండింపవే.


అని పలికి కృష్ణు డమ్మకు నోరు తెఱచి చూపిస్తాడు.ఆమె అతని నోటిలో 'జలధి పర్వత వన భూగోళ శిఖి దిక్పాలాది కరండమైన బ్రహ్మాండా'న్నంతా చూచి ఇలా అనుకొందట.

పై పద్యంలోని మాటలన్నీ మన చిన్నపిల్లలు మనతో మనం నిలదీసినప్పుడు చెప్పే మాటలే! ఎంత సహజసిద్ధమైన ధారాశుద్ది! చిన్నపిల్లల్ని- వాళ్ళుచేసే చెడ్డ పనులను గురించి వాళ్ళను దండించాలని చూసే ప్రతి తల్లి తోనూ ప్రతిపిల్లవాడు తనను తాను సమర్ధించుకుంటూ పలికే ముద్దు ముద్దు పలుకులే కిట్టయ్య నోటినుంచి కూడా అలవోకగా జాలువారేలా చేసారు పోతన గారు.
వీటినానందించటం కోసమైనా మనం భాగవతం తప్పక చదవాలి.
అప్పుడా యశోద తనలో తను --
మ.
కలయో! వైష్ణవ మాయయో! యితర సంకల్పార్థమో! సత్యమో!
తలప న్నేరక యున్నదాననొ! యశోదాదేవిఁ గానో! పర
స్థలమో! బాలకుఁ డెంత! యీతని ముఖస్థం బై యజాండంబు ప్ర
జ్వల మై యుండుట కేమి హేతువొ! మహాశ్చర్యంబు చింతింపఁగన్!


మా చిన్నప్పటి రోజుల్లో ఈ రెండు పద్యాలు దాదాపు అందరికీ కంఠస్థంగానే ఉండేవి.

0 comments:

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks