రాఁముడు వైష్ణవచాపము నెక్కిడుట
మధ్యాక్కర.
నీకర్మ లోకాద్భుతంబు నీవలె నృపలోకమెల్ల
సాకుగా నిర్వదియొక్క సారులు చంపఁగనగునె?
చేకొని తలఁచినయంత చేయంగఁ జేవయు వలదె?
కాక నీకింత కోపమ్ముఁగలిగించు గారణంబుండె. 475
చ.
అది యటులుంచి వైష్ణవశరాసన మియ్యది యెక్కు పెట్టినన్
వదలిన బాణ మెప్పుడును వ్యర్థముకాని ప్రతిజ్ఞ నాకు ను
న్నది శివచాప మక్కతమునం గల మందసమందె యమ్ము లే
నిది విదలించితిన్ బరిగణించి వచింపుఁడు మీరె నాకనన్. 476
వ. పరశురాముండిట్లనియె.
మధ్యాక్కర.
నీ వెక్కు పెట్టెదవేని నీ క్రింద నే నోడినట్లె
యావల శరమేయుటెందొ? యప్పటి యామాట చూతు
శ్రీవైష్ణవము మహాధనువు చేతి కిచ్చెదను గైకొమ్ము
నీ విశ్వమోహనకరము నిగిడించు నీరదాకార ! 478
క.
అనుటయు ధనువిచ్చుటయును
ధనువు రఘూత్తం సకమ్ము తాఁ గొనుటయు లొ
క్క నిమేషంబున జరిగెను
ధనువు తుదంబడి యొకండు తాదీపితమై. 479
శా.
శంఖస్వచ్ఛముగా సుదర్శనమహాచండాంశుసంఘర్షిగా
ప్రేంఖాగారుడపక్ష పుచ్ఛ నిబిడ శ్రీకాంతిగా వెంబడిన్
న్యూంఖోదారనినాదమేదురముగా నుద్భాంతిగానై ధనుః
పుంఖంబుంబడి తేజ మొండు వెలిఁగెన్ మున్నంచి వెన్నంచియై. 480
క.
ధనువుఁ గొనినంత రాముని
కు ననంతానంత కల్పఘోర తపస్సం
జనితమగు శక్తి తనదగు
తనువునఁ గల్గినటు తోఁచెఁ దత్కాలమునన్. 481
క.
తన సంపాదించిన పు
ణ్యనితాంతాభినవజగము లన్నియు వడి జా
రినరీతి దోఁచె భార్గవు
తనువున మనసున నితాంత తాపము గలుగున్. 482
కమలనగీతి.
ధనువుఁబూను రామచంద్రుదర్ళనంబు చేయఁ
జనిరి సర్వదేవతలును జలజసంభవుండు
ధవునుఁబూని రాఘవుండు దానిగొనము చేత
నినిచి జ్యానినాదమునను వించె సర్వధాత్రి. 483
శా.
నృత్యన్మంజుల తారహార కబరీనిష్యంది ముక్తామణి
ప్రత్యగ్రప్రసవాక్షి సంకలన దీవ్యత్కంధరా భేద సా
హిత్య ప్రౌఢనవాప్సరోనటన సౌహిత్యప్రశస్తాచ్ఛదృ
గ్గీత్యాకార మనోజ్ఞ మై ధనువు మ్రోగెన్ సర్వలోకంబులన్. 484
వ.
అంత శ్రీరామచంద్రుండు బాణంబు సంధించి భార్గవుంజూచి-
ఏ మతం వద్ద ఎన్నెన్ని ఆస్తులు ఉన్నాయి?
1 day ago
0 comments:
Post a Comment