నే నెందుకు బ్లాగాలనుకుంటున్నాను।ఎప్పుడో అప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాలి ప్రతి బ్లాగరూ।నేనెందుకు బ్లాగుతున్నానంటే--
ప్రతి వ్యక్తికీ తనకు తోచినవీ, తను తెలుసుకున్నవీ నలుగురితో పంచుకోవాలనీ - నలుగురూ తనను ఆహా ఓహో అని మెచ్చుకోవాలనీ ఓ విధమైన కోర్కె - బయటకు చెప్పకపోయినా - లోలోపల వుంటూవుంటుంది। దీనికి నేనూ మినహాయింపు కాదు।నలుగురిలో ఫ్రీగా మాటలద్వారా అన్నీ చెప్పాలంటే అది అందరికీ సాధ్యమయ్యేపని కాదు।బ్లాగు ద్వారా ఇటువంటివి చాలా సులభం।పైగా బ్లాగుల ద్వారా ఒకే సమయంలో ఎక్కడెక్కడో వున్నవారితో భావాలు పంచుకోవటం తేలిగ్గానూ వీలుగానూ వుంటుంది।ఈ టపా రాస్తున్న సమయంలోనే రానారె గారి క్షణికమ్ టపా చూడటం జరిగింది।నేను ఈ టపాలో చెప్పాలని అనుకుంటున్న భావాలను నాకంటే ఎంతో అందంగా వారు అందులో ఆవిష్కరించారు।సంయమనంతో కూడిన భావవ్యక్తీకరణ ద్వారా బ్లాగ్మిత్రులందరూ ఒకరికొకరు సహాయపడగలరని, అలా సహాయపడతారనీ ఆశిస్తూ నా మూడు బ్లాగుల ద్వారా(నరసింహ,భారతీయం,అన్నమయ్య పలుకుబడులు-జాతీయములు) సుమారుగా ५० బ్లాగులు పూర్తి చేయగలిగాననే సంతోషాన్ని నలుగురితో పంచుకుందామని-----
Jul 3, 2008
నే నెందుకు బ్లాగాలనుకుంటున్నాను
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
Congrats for 50.
You have a nice blog and blogging spirit too....
Keep it up.
baagunnadi mIblaagu
ఒరెమున,దుర్గేశ్వరులకు
నెనరులు.మీ ప్రోత్సాహం మంచి టానిక్ లా ఉపయోగపడుతుందండి.
Post a Comment